గ్రామ పంచాయతీ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | Panchayatraj Department Recruitment

గ్రామ పంచాయతీ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తూర్పు గోదావరి మరియు చిత్తూరు జిల్లాల పంచాయతీరాజ్ శాఖ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం 10వ తరగతితో సొంత గ్రామంలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటివంటి ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి మరియు చిత్తూరు జిల్లాలోని ఆయా గ్రామాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Panchayatraj Department Recruitment 2020

సంస్థ పేరు :
పంచాయతీ రాజ్ శాఖ, గ్రామ మరియు వార్డు వాలంటీర్
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా పంచాయతీరాజ్ శాఖలోని, గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులను క్రింది జిల్లాలలో భర్తీ చేయనున్నారు.
తూర్పుగోదావరి – 216 పోస్టులు
చిత్తూరు – 765 పోస్టులు

అర్హతలు :

విద్యార్హత : పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• ఆభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తేర్ణులై ఉండాలి.
• ప్రభుత్వ సంక్షేమ పథకాల పై పూర్తి పట్టు మరియు అవగాహన కలిగి ఉండాలి.
• ప్రభుత్వ పథకాల గురించి సామాన్య ప్రజలకు వివరించే నేర్పు కలిగి ఉండాలి.
• కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ అవసరం.
• అభ్యర్థులు తప్పనిసరిగా సొంత ప్రాంతం అనగా స్థానికులై ఉండాలి.
• తెలుగు రాయడం మరియు చదవడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
గ్రామ, వార్డు వాలంటీర్ గా ఎంపికయినట్లైతే అభ్యర్థులు పంచాయతీరాజ్ శాఖ వారి ఉత్తర్వుల ప్రకారం రూ 5,000/- లు వేతనంగా అందుకుంటారు. దరఖాస్తు విధానం : ఆన్ లైన్ • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – తూర్పుగోదావరి జిల్లా నోటిఫికేషన్ కు నవంబర్ 28, 2020, అలానే చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ కు నవంబర్ 25, 2020 నుండి ప్రారంభమవుతుంది.
దరఖాస్తు ఆఖరు తేదీ – తూర్పుగోదావరి జిల్లా నోటిఫికేషన్ కు డిసెంబర్ 03, 2020, అలానే చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ కు డిసెంబర్ 06, 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
ఆయా జిల్లాలోని మండల ఎంపిడిఓ కేంద్రాలలో జరుగును.

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
అధికారిక వెబ్సైట్ : క్లిక్ హియర్
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్

2 thoughts on “గ్రామ పంచాయతీ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | Panchayatraj Department Recruitment”

    • తెలియజేస్తానండి. గ్రామ వాలంటీర్ పోస్టులు విడుదల చేసి ఉన్నారుగా మీ గ్రామంలో ఖాళీగా ఉంటే అప్లై చేసుకోండి

      Reply

Leave a Comment